ఉభయ సభల సూచనలతోనే నూతన పార్లమెంట్ భవనం : ఓం బిర్లా
ABN, First Publish Date - 2021-06-20T01:22:13+05:30
ఉభయ సభల సూచనలతోనే కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి సన్నద్ధమైందని
న్యూఢిల్లీ : ఉభయ సభల సూచనలతోనే కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి సన్నద్ధమైందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొనే, నూతన భవన నిర్మాణానికి పూనుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తనంతట తాను నూతన భవన నిర్మాణానికి ముందుకు రాలేదని, ఉభయ సభల సూచనల మేరకే ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాలను వర్చువల్గా నిర్వహించాలని కొందరు సూచిస్తున్నారని, అయితే లోక్సభ నిబంధనల ప్రకారం వర్చువల్గా సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయినా, తాము ఈ ప్రతిపాదపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఓం బిర్లా తెలిపారు.
Updated Date - 2021-06-20T01:22:13+05:30 IST