ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘ఆయన్నే అడగండి... నన్నెందుకు?’’ : కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై సీఎం నితీశ్

ABN, First Publish Date - 2021-03-07T22:12:59+05:30

ప్రజల కష్టాలను వినని ప్రభుత్వ అధికారులను వెదురు బొంగులతో చావబాదాలన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : ప్రజల కష్టాలను వినని ప్రభుత్వ అధికారులను వెదురు బొంగులతో చావబాదాలన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ వ్యాఖ్యలపై మీరేమంటారు? అని ప్రశ్నించగా... ‘‘ఆయన్నే అడగండి. అలాంటి పదాలు వాడటం సరియైనదా?అని ఆయన్నే అడగండి. అంతకంటే ఏమీ మాట్లాడను.’’ అని నితీశ్ సమాధానమిచ్చారు. ప్రజల కష్టాలు వినడానికి సుముఖంగా లేని అధికారులను ప్రజలే వెదురు బొంగులతో చావబాదాలని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘అవినీతి చేయాలని మేం వాళ్లని కోరం. అలాగే ఏ అధికారి అయినా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోం. ప్రజల బాధలు వినని అధికారులను వెదురు బొంగులతో చావబాదాలి.’’ అని గిరిరాజ్ అన్నారు.

Updated Date - 2021-03-07T22:12:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising