ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఎమ్మెల్సీ మృతి... సీఎం నితీశ్ సంతాపం..

ABN, First Publish Date - 2021-05-09T02:31:24+05:30

కరోనా కారణంగా ఇవాళ బీహార్ ఎమ్మెల్సీ, జేడీయూ నేత తన్వీర్ అక్తర్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: కరోనా కారణంగా ఇవాళ బీహార్ ఎమ్మెల్సీ, జేడీయూ నేత తన్వీర్ అక్తర్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్తర్ మరణం బీహార్ రాజకీయ, సామాజిక రంగానికి తీరని లోటు అంటూ సీఎం ట్వీట్ చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ‘‘బీహార్ ఎమ్మెల్సీ తన్వీర్ అక్తర్ మరణం తీవ్ర విచారకరం. ఆయన అత్యంత నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన మరణం రాజకీయ, సమాజిక రంగాలకు తీరని లోటు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను..’’ అని నితీశ్ ట్వీటర్లో పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం అక్తర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను పాట్నాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. 

Updated Date - 2021-05-09T02:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising