ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ సంస్కరణలతో రానున్న దశాబ్దంలో వృద్ధి వేగవంతం : నీతీ ఆయోగ్ సీఈవో

ABN, First Publish Date - 2021-03-26T01:58:57+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న సంస్కరణలు రానున్న దశాబ్దంలో సత్ఫలితాలిస్తాయని నీతీ ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఎంతో కాలంగా కోరుకుంటున్న సంస్కరణలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్, 2021లో గురువారం ఆయన మాట్లాడారు. 


ప్రతి సంవత్సరం ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వృద్ధి చెందడం భారత దేశం ముందు ఉన్న నిజమైన సవాలు అని అమితాబ్ కాంత్ చెప్పారు. 1991లో భారీ సంస్కరణలు జరిగాయని, ఆ తర్వాత అంతగా సంస్కరణలు జరగలేదని అన్నారు. అయితే కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎంతో కాలంగా కోరుతున్న స్ట్రక్చరల్ రిఫార్మ్‌స్ జరిగాయని చెప్పారు. గనులు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు వంటి రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల ఆర్ధికాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. 


ఎంతో కాలంగా కోరుతున్న సంస్కరణలను కోవిడ్ మహమ్మారి తర్వాత అమల్లోకి తీసుకొచ్చారని, ఆర్థిక వ్యవస్థ కోలుకునే తీరు ఆంగ్ల అక్షరం ‘వీ’ రూపంలో ఉందని చెప్పారు. రానున్న దశాబ్దంలో వృద్ధి కనిపిస్తుందని చెప్పారు. ఇటీవలి సంస్కరణలు కేవలం వచ్చే ఏడాదిలో మాత్రమే కాకుండా రానున్న దశాబ్దంలో వృద్ధి వేగాన్ని పెంచుతాయని చెప్పారు. 


Updated Date - 2021-03-26T01:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising