‘శ్రీవారి’ వేషంలో నిత్యానంద!
ABN, First Publish Date - 2021-04-11T07:34:56+05:30
తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి చెందిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద తాజాగా తిరుమల శ్రీవారి వేషధారణలో తన భక్తులకు దర్శనమిచ్చారు. ఇన్నాళ్లుగా పరమశివుడు, కాలభైరవుడి వేషాల్లో క నిపించిన ఆయన
వివాదాస్పద స్వామీజీ కొత్త గెటప్
చెన్నై, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి చెందిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద తాజాగా తిరుమల శ్రీవారి వేషధారణలో తన భక్తులకు దర్శనమిచ్చారు. ఇన్నాళ్లుగా పరమశివుడు, కాలభైరవుడి వేషాల్లో క నిపించిన ఆయన ఇప్పుడు వేం కటేశ్వరస్వామిలా ఒంటినిండా బంగారుఆభరణాలు అలంకరించుకుని తీసుకున్న ఫొటో, వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వాటితో పాటు ‘భగవాన్ శ్రీవేంకటేశ్వరస్వామివారి మంగళాశీస్సులు మీకు లభించును గాక! శ్రీ వారి అనుగ్రహంతో మీరంతా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడండి. మీ అందరికీ సకల సంపదలు కలుగుగాక!’ అంటూ తమిళంలో ఓ సందేశాన్ని కూడా ఉంచారు. ప్రసు ్తతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Updated Date - 2021-04-11T07:34:56+05:30 IST