ఎన్జీటీ రిజిస్ట్రార్ జనరల్ ఆషు గార్గ్ కరోనాతో కన్నుమూత!
ABN, First Publish Date - 2021-05-08T15:52:17+05:30
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) రిజిస్ట్రార్ జనరల్...
న్యూఢిల్లీ: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) రిజిస్ట్రార్ జనరల్ అషు గార్గ్ కరోనాతో కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఢిల్లీలోని బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రిలో ఈరోజు తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఇదే ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవలే కరోనా కారణంగా ఢిల్లీ జిల్లా కోర్టుకు చెందిన ఇద్దరు జ్యుడిషియల్ అధికారులు కరోనాతో మృతి చెందారు. గార్గ్ గత ఏడాది జనవరిలో ఎన్జీటీలో రిజిస్ట్రార్ జనరల్ పదవి చేపట్టారు. కాగా ఢిల్లీలో గత 24 గంటల్లో 335 మంది మృతి చెందారు.
Updated Date - 2021-05-08T15:52:17+05:30 IST