నీట్లో కోటాలపై 16న సుప్రీంలో విచారణ
ABN, First Publish Date - 2021-10-29T08:20:09+05:30
నీట్ ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తదుపరి..
న్యూఢిల్లీ, అక్టోబరు 28: నీట్ ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తదుపరి విచారణను నవంబరు 16న చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. మెడికల్ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రారంభించే అంశాన్ని దీపావళి సెలవుల తర్వాత విచారణకు తీసుకోవాలని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును అభ్యర్థించారు.
Updated Date - 2021-10-29T08:20:09+05:30 IST