ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు సుపరిపాలనకే ప్రాధాన్యమిచ్చారు: మోదీ

ABN, First Publish Date - 2021-11-29T01:55:26+05:30

న్యూఢిల్లీ: త్రిపుర పురపాలికల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: త్రిపుర పురపాలికల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. అగర్తల నగర పాలక సంస్థతోపాటు 13 పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు సుపరిపాలనకే ఓటేసి స్పష్టమైన సందేశం ఇచ్చారని చెప్పారు. త్రిపుర ప్రజల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేసేందుకు ఎన్నికల ఫలితాలు స్ఫూర్తినిచ్చాయంటూ మోదీ ట్వీట్ చేశారు. పార్టీ విజయం కోసం ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ నేతృత్వంలో కష్టపడిన కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. పురపాలికల ఎన్నికల్లో బీజేపీ 329 స్థానాలను కైవసం చేసుకుంది. సీపీఎం-3, టీఎంసీ-1, TIPRA-1 స్థానాలను దక్కించుకున్నాయి. అగర్తల నగర పాలక సంస్థలోని అన్ని (51) స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 



Updated Date - 2021-11-29T01:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising