ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైసూర్ సంచలన గ్యాంగ్‌రేప్ కేసు: ఐదుగురి అరెస్టు

ABN, First Publish Date - 2021-08-28T20:48:32+05:30

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైసూర్ గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆరో వ్యక్తి పరారీలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైసూర్ గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆరో వ్యక్తి పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ శనివారంనాడు ఈ అరెస్టుల విషయాన్ని ధ్రువీకరించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితులలో ఒకరు బాలుడని, అయితే ఈ విషయం తుదుపరి దర్యాప్తులో తేలుతుందని ప్రవీణ్ సూద్ చెప్పారు. ఈ కేసులో నలుగురిని సత్యమంగళ (తమిళనాడు)లో అరెస్టు చేయగా, ఐదో వ్యక్తి కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్‌లో పట్టుకున్నారు. వీరిలో ముగ్గురికి నేరచరిత్ర కూడా ఉంది.


ఇది మా విజయం: హోం మంత్రి

సంచలనం సృష్టించిన విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నిందుతులను అరెస్టు చేయడం పోలీసుల విజయంగా కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఎందరిని అరెస్టు చేసారనే విషయంపై వ్యాఖ్యానించేందుకు మాత్రం నిరాకరించారు. ఈనెల 24న విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్‌తో మైసూరు శివార్లకు వెళ్లగా, వారిరువురిపై కొందరు దాడి చేసి, విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టడం సంచలనమైంది.

Updated Date - 2021-08-28T20:48:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising