నిబంధనలకు విరుద్ధంగా రొహింగ్యాలను మయన్మార్ పంపొద్దు: సుప్రీం
ABN, First Publish Date - 2021-04-09T06:39:24+05:30
జమ్ములో నిర్బంధంలో ఉన్న రొహింగ్యాలను నిర్ణీత పద్ధతి పాటించకుండా మయన్మార్ పంపించొద్దని సీజే బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: జమ్ములో నిర్బంధంలో ఉన్న రొహింగ్యాలను నిర్ణీత పద్ధతి పాటించకుండా మయన్మార్ పంపించొద్దని సీజే బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది. రొహింగ్యా శరణార్థులను తక్షణమే విడుదల చేయాలని, వారిని మయన్మార్ పంపకుండా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు. ఈ వాదనతో కేంద్రం విభేదించింది. అక్రమ శరణార్థులకు భారత్ కేంద్రం కారాదని పేర్కొంది.
Updated Date - 2021-04-09T06:39:24+05:30 IST