‘నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని ఎంపీ’
ABN, First Publish Date - 2021-05-04T18:36:13+05:30
మండ్యలో కరోనా కేసులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నా స్థానిక ఎంపీ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి
బెంగళూరు: మండ్యలో కరోనా కేసులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నా స్థానిక ఎంపీ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి నారాయణగౌడతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలలో నిత్యం అందుబాటులో ఉంటూ స్థానికులకు సేవలందిస్తున్నారు. కానీ ఎంపీ సుమలత మాత్రం అటువైపు వెళ్లకపోవడం విమర్శలకు కారణమవుతోంది. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సుమలత, ఆ తర్వాత జిల్లావైపు వెళ్లలేదు. ఆమె మండ్యకు వెళ్లి నెలన్నరకాలం ముగిసింది. ఇటీవల నెల రోజులుగా కరోనా పరిస్థితి దారుణంగా మారినా ఆమె అందుబాటులోకి లేకపోవడాన్ని సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది.
Updated Date - 2021-05-04T18:36:13+05:30 IST