ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడికి జడ్ కేటగిరి భద్రత

ABN, First Publish Date - 2021-03-05T13:41:04+05:30

బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ ను కేంద్ర బీజేపీ పరిశీలకుడిగా బెంగాల్ రాష్ట్రానికి పంపిస్తున్న నేపథ్యంలో ఆయనకు జడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. బెంగాల్ ఎన్నికల్లో హింసాకాండ చెలరేగే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిత్యానందరాయ్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతోపాటు సీఆర్ పీఎఫ్ జవాన్లను రక్షణగా నియమించాలని నిర్ణయించారు.గతంలో బీజేపీ నేతలు జేపీ నడ్డా, కైలాష్ విజయవర్గీయల కాన్వాయ్ లపై దాడి జరిగిన నేపథ్యంలో బీజేపీలో చేరిన టీఎంసీ ఎమ్మెల్యే రజీబ్ బెనర్జీకి కూడా జడ్ కేటగిరి రక్షణ కల్పించారు.బీజేపీలో చేరిన మాజీ మంత్రికి వై కేటగిరి భద్రత కల్పించారు.బెంగాల్ పర్యటన సందర్భంగా కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్ కు 10 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తామని కేంద్రం వివరించింది.

Updated Date - 2021-03-05T13:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising