ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోప్‌ ఫ్రాన్సిస్‌ని కలవనున్న ప్రధాని మోదీ!

ABN, First Publish Date - 2021-10-28T22:27:14+05:30

ఇటలీ రాజధాని రోమ్‌లో అక్టోబర్ 29 నుంచి 31 వ తేదీ వరకు జరిగే జీ-20 సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోతున్న ఎనిమిదవ జీ-20 సదస్సు ఇది. గత ఏడాది జీ-20 సదస్సు సౌది అరేబియాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలుసుకోనున్నారట. ఇటలీలో జరిగే జీ-20 సమావేశానికి వెళ్లనున్న మోదీ అటు నుంచి వాటికన్ సిటీకి వెళ్లి పోప్ ఫ్రాన్సిస్‌ని కలుసుకోనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా తెలిపారు. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదని ఇరు వైపుల అధికారులు దీనిపై నిర్ణయించి తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని, తొందరలోనే దీనిపై ఒక నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 30వ తేదీన పోప్ ఫ్రాన్సిస్‌ని మోదీ కలుసుకోనున్నట్లు హర్ష్ వర్ధన్ శ్రింగ్లా పేర్కొన్నారు.


ఇటలీ రాజధాని రోమ్‌లో అక్టోబర్ 29 నుంచి 31 వ తేదీ వరకు జరిగే జీ-20 సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోతున్న ఎనిమిదవ జీ-20 సదస్సు ఇది. గత ఏడాది జీ-20 సదస్సు సౌది అరేబియాలో జరిగింది. అయితే అప్పుడు కొవిడ్ కారణంగా వర్చువల్ ద్వారా సమావేశం నిర్వహించారు. జీ-20 సదస్సుకు మోదీ చివరిసారిగా హాజరైంది 2019లో ఒసాకాలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు. అనంతరం రెండేళ్లకు ఇటలీలో జరగబోతున్న సమావేశానికి హాజరుకానున్నారు.

Updated Date - 2021-10-28T22:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising