ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీయే పెద్ద విధ్వంసకారి: మమత

ABN, First Publish Date - 2021-02-25T06:54:48+05:30

ప్రధాని మోదీ దేశంలోనే అతి పెద్ద దొమ్మీకోరు, విధ్వంసకారి అని పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సహగంజ్‌, ఫిబ్రవరి 24: ప్రధాని మోదీ దేశంలోనే అతి పెద్ద దొమ్మీకోరు, విధ్వంసకారి అని పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. బెంగాల్లో లంచాల సంస్కృతి రాజ్యమేలుతోందని, తృణమూల్‌ గూండాల స్వైరవిహారంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని మోదీ రెండ్రోజుల కిందట హుగ్లీ జిల్లాలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో నిప్పులు చెరిగారు.


మమత అదే జిల్లాలో బుధవారం జరిపిన సభల్లో వాటికి దీటుగా బదులిచ్చారు. తృణమూల్‌ను మోదీ తోలాబాజ్‌ (దోపిడీదారు) అని దూషించడంతో మమత ఆయనను దంగాబాజ్‌ (దొమ్మీకోరు) అనీ, దేశానికి పట్టిన దెయ్యమనీ అభివర్ణించారు. బొగ్గు కుంభకోణంలో తన మేనల్లుడు, తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీని సీబీఐ ప్రశ్నించడంపై మమత తీవ్రంగా మండిపడ్డారు. 


Updated Date - 2021-02-25T06:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising