‘రిమోట్ ఓటింగ్’ పై తర్వలోనే మాక్ ట్రయల్స్ : సునీల్ అరోరా
ABN, First Publish Date - 2021-01-25T18:54:54+05:30
‘రిమోట్ ఓటింగ్’ పై తర్వలోనే మాక్ ట్రయల్స్ను ప్రారంభిస్తామని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు.
న్యూఢిల్లీ : ‘రిమోట్ ఓటింగ్’ పై తర్వలోనే మాక్ ట్రయల్స్ను ప్రారంభిస్తామని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘రిమోట్ ఓటింగ్ విషయంలో కాస్త పురోగతి సాధించాం. త్వరలోనే మాక్ ట్రయల్స్ను కూడా ప్రారంభిస్తాం. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ ఓటర్లకు పోస్టల్ బ్యాెట్ సదుపాయాన్ని కల్పించాలన్న ప్రతిపాదన కూడా న్యాయశాఖ ప్రతిపాదనలో ఉంది.’’ అని అరోరా పేర్కొన్నారు.
Updated Date - 2021-01-25T18:54:54+05:30 IST