ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోద్రాలో 9 స్థానాల్లో పోటీ చేసి 7 గెలిచిన ఎంఐఎం

ABN, First Publish Date - 2021-03-03T15:38:29+05:30

కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైందని భావించిన ఎంఐఎం నెమ్మదిగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ పోటీ చేసిన తక్కువ స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 2002లో అలర్లు జరిగిన గోద్రాలో 9 స్థానాల్లో పోటీ చేయగా 7 స్థానాలు గెలుచుకుంది. గోద్రా మున్సిపాలిటీలో ఎంఐఎం పోటీకి దిగడం ఇదే మొదటిసారి. కొద్ది రోజుల క్రితం విడుదలైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సత్తా చాటింది. అహ్మదాబాద్ కార్పొరేషన్ పరిధిలో 4 స్థానాలను ఎంఐఎం చేజిక్కించుకుంది. ఇకపోతే, మొదాసాలో 12 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. బరూచ్‌లో కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంది.


కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైందని భావించిన ఎంఐఎం నెమ్మదిగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం.. కొద్ది రోజుల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఇక మొదటిసారి గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పోటీకి దిగి తగిన స్థానాల్ని గెలుచుకుంది.

Updated Date - 2021-03-03T15:38:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising