ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీయులకు టూరిస్ట్ వీసాలు నవంబరు 15 నుంచి

ABN, First Publish Date - 2021-10-08T01:21:37+05:30

భారత దేశానికి వచ్చే విదేశీయులకు టూరిస్టు వీసాల జారీ సేవలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశానికి వచ్చే విదేశీయులకు టూరిస్టు వీసాల జారీ సేవలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) పునరుద్దరిస్తోంది. ఛార్టర్డ్ విమానాల్లో వచ్చేవారికి అక్టోబరు 15 నుంచి, ఇతర విమానాల్లో వచ్చేవారికి నవంబరు 15 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కోవిడ్-19 సంబంధిత నిబంధనలను యాత్రికులు, సంస్థలు పాటించాలని తెలిపింది. 


ఎంహెచ్ఏ విడుదల చేసిన ప్రకటనలో, విదేశీ యాత్రికులు, వారిని భారత దేశానికి తీసుకొచ్చే విమానయాన సంస్థలు, ఇతర సంబంధితులు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. 


కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విదేశీయులకు మంజూరు చేసిన అన్ని వీసాలను ప్రభుత్వం గత ఏడాది సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ఆంక్షలను విధించింది. కోవిడ్-19 పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత విదేశీయులు భారత్‌ వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  టూరిస్ట్ వీసా మినహా ఇతర ఇండియన్ వీసాలపై భారత్‌కు రావచ్చునని తెలిపింది. టూరిస్టు వీసాలను పునఃప్రారంభించాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. 


Updated Date - 2021-10-08T01:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising