ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కేంద్ర కమిటీ నుంచి మేనకా గాంధీ తొలగింపు

ABN, First Publish Date - 2021-10-07T20:14:01+05:30

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. కాగా, రైతులకు మద్దతుగా వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘తన మనసును కలచివేసింది’’ అంటూ వరుణ్ ట్వీట్ చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీని భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ నుంచి తొలగించారు. ఆమె కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ రైతు ఆందోళనపై ట్వీట్లు చేయడంతో మేనకాపై వేటు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. కాగా, రైతులకు మద్దతుగా వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘తన మనసును కలచివేసింది’’ అంటూ వరుణ్ ట్వీట్ చేశారు. కాగా బుధవారం కూడా ఈ విషయమై స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. రైతులు రక్తం ధారపోశారు. ఆ రక్తానికి బాధ్యత ఎవరిది? రైతులు తీవ్ర ఆగ్రహానికి లోను కాకముందే న్యాయం లభించాలి’’ అని ట్వీట్ చేశారు. గతంలో కూడా రైతు ఆందోళనపై వరుణ్ ట్వీట్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వారికి కల్పించాల్సిన వసతులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. కొంత కాలంగా వరుణ్ గాంధీ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ అధిష్టానం.. తాజా స్పందనతో మేనకాపై వేటు వేసినట్లు చెప్పుకొస్తున్నారు.

Updated Date - 2021-10-07T20:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising