ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిగ్రామ్‌లో మమతతో సువేందు ఢీ

ABN, First Publish Date - 2021-03-05T13:23:52+05:30

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీపై మాజీ మంత్రి సువేందు అధికారిని ఎన్నికల బరిలోకి దించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ సీఈసీ సమావేశం నిర్ణయం

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీపై  మాజీ మంత్రి సువేందు అధికారిని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి తాను మమతాబెనర్జీని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే తాను నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని, తాను ఈ నెల 11వతేదీన నామినేషన్ సమర్పిస్తానని మమతాబెనర్జీ ప్రకటించారు. బీజేపీ సువేందు అధికారి అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో నందిగ్రామ్ లో పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది.


 టీఎంసీలో ఉన్నపుడు సువేందు అధికారి మమతాబెనర్జీకి అనుంగు అనుచరుడిగా గుర్తింపు పొందారు. నందిగ్రామ్ లో అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం  బలవంతంగా చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా మమతాబెనర్జీ పోరాడి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి తీసుకువచ్చిన నందిగ్రామ్ ను మమతాబెనర్జీ విస్మరించారని బీజేపీలో చేరిన సువేందు అధికారి విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంమీద నందిగ్రామ్ అసెంబ్లీ సమరం సువేందు అధికారి రంగంలోకి దిగనుండటంతో ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2021-03-05T13:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising