వరదలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ మంత్రి
ABN, First Publish Date - 2021-08-06T08:06:36+05:30
వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వెళ్లిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రమాదంలో చిక్కుకోవడంతో ఐఏఎఫ్ చాపర్ ద్వారా అధికారులు కాపాడారు.
కాపాడిన ఐఏఎఫ్ చాపర్
భోపాల్, ఆగస్టు 5: వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వెళ్లిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రమాదంలో చిక్కుకోవడంతో ఐఏఎఫ్ చాపర్ ద్వారా అధికారులు కాపాడారు. దతియా జిల్లాలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మిశ్రా రాష్ట్ర విపత్తు స్పందనా దళంకు చెందిన బోట్లో కోట్రా గ్రామానికి వెళ్లారు. పూర్తిగా నీట మునిగిన ఆ గ్రామంలోని ఒక ఇంటి పైకప్పుపై సహాయం కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులను కాపాడుతుండగా, ఒక చెట్టు కూలి మంత్రి పర్యటిస్తున్న బోట్పై పడింది. వెంటనే మంత్రి అధికారులకు సమాచారమిచ్చారు. స్పందించిన అధికారులు ఐఏఎఫ్ చాపర్ను పంపారు. అయితే, వరదలో చిక్కుకున్న గ్రామస్తులందరినీ కాపాడేవరకు ఆగిన మంత్రి, ఆ తర్వాతే చాపర్ నుంచి జారవిడిచిన తాడు సహాయంతో సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు.
Updated Date - 2021-08-06T08:06:36+05:30 IST