కరెంట్ పోలెక్కిన విద్యుత్తు మంత్రి
ABN, First Publish Date - 2021-06-20T08:47:51+05:30
ఆయన విద్యుత్తు శాఖ మంత్రి. చకచకా కరెంట్ పోల్ ఎక్కారు. స్తంభంపైన అల్లుకుపోయిన లతలు, కొమ్మలను తొలగించారు. మధ్యప్రదేశ్ విద్యుత్తు శాఖ
భోపాల్, జూన్ 19: ఆయన విద్యుత్తు శాఖ మంత్రి. చకచకా కరెంట్ పోల్ ఎక్కారు. స్తంభంపైన అల్లుకుపోయిన లతలు, కొమ్మలను తొలగించారు. మధ్యప్రదేశ్ విద్యుత్తు శాఖ మంత్రి ప్రద్యువన్ తోమర్దీ పని. హైటెన్షన్ విద్యుత్తు స్తంభాన్ని ఆయన నిచ్చెన సాయంతో ఎక్కి శుభ్రం చేస్తుంటే అధికారులు నోరెళ్లబెట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. స్తంభాల పైకి ఎగబాకే తిగలు, అక్కడ పేరుకుపోయే చెత్తాచెదారం కారణంగా కొన్నిసార్లు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని, ఇలాంటివన్నీ చెక్ చేయడం తన బాధ్యత అని తోమర్ పేర్కొన్నారు.
Updated Date - 2021-06-20T08:47:51+05:30 IST