ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది మరీ దారుణం.. తన మరణ వార్తలపై సుమిత్రా మహాజన్ ఫైర్..

ABN, First Publish Date - 2021-04-23T18:50:47+05:30

బీజేపీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ చనిపోయారంటూ వార్తలు రావడంతో ఇవాళ తీవ్ర కలకలం రేగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: బీజేపీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ చనిపోయారంటూ వార్తలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సైతం ఆమె మరణంపై ట్వీట్ చేయడంతో మరింత గందరగోళం నెలకొంది. అయితే ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ బీజేపీ నేతలు స్పందించడంతో శశిథరూర్ సహా మిగతా వారంతా తమ ట్వీట్లను డిలీట్ చేశారు. గురువారం రాత్రి నుంచి మొదలైన ఈ ప్రచారంపై సుమిత్రా మహాజన్ స్పందిస్తూ.. ‘‘ఎలాంటి ధ్రువీకరణ లేకుండా వీళ్లంతా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే నేనేం చేసేది? ఇలా వార్తలు చెప్పేముందు కనీసం ఇండోర్ జిల్లా అధికారులనైనా కనుక్కుని ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కోరుతున్నా...’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు సుమిత్రా మహాజన్ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్‌ను ఆమె కుమారుడు మందార్ ట్విటర్లో పోస్టు చేశారు. 


‘‘ఈ వార్త దేశం మొత్తం వ్యాపించింది. ముంబైలోని నా బంధువులు సైతం నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఈ తప్పుడు వార్త ఎవరు చెప్పారంటూ ట్విటర్లో శశి థరూర్‌ని నా తమ్ముడి కూతురు నిలదీసింది...’’ అని ఆమె పేర్కొన్నారు. ముంబైలోని కొన్ని న్యూస్ చానెళ్లు సైతం ఎందుకు తన మరణంపై తప్పుడు వార్తలు ఫ్లాష్ చేశాయోనంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు. కాగా మహాజన్‌పై ట్విటర్లో పెట్టిన పోస్టును డిలీట్ చేసిన అనంతరం శశిథరూర్ స్పందిస్తూ... ‘‘ఆమె ఆరోగ్యంగా ఉన్నారంటే నాకు అంతకు మించిన ఉపశమనం లేదు. నమ్మకమైన చోట నుంచి నాకు సమాచారం అందడంతో అది నిజమేనని అనునుకున్నాను..’’ అని పేర్కొన్నారు. అనంతరం మరో ట్వీట్‌లో స్పందిస్తూ... ‘‘సుమిత్రా మహాజన్ కుమారుడితో మాట్లాడాను. గత రాత్రి చోటుచేసుకున్న తప్పుడు ప్రచారం గురించి క్షమాపణ చెప్పాను. ఆయన దయతో నన్ను అర్థం చేసుకున్నారు. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి సంతోషం కలిగింది. ఆమె, ఆమె కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాను...’’ అని పేర్కొన్నారు. మరోవైపు తన తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారనీ... ఆమెపై వచ్చిన తప్పుడు వార్తలను నమ్మొద్దంటూ సుమిత్రా మహాజన్ కుమారుడు మందార్ పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్‌గా సేవలు అందించారు.





Updated Date - 2021-04-23T18:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising