ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీవ్ర సంచలనం : ప్రియుడిపై యాసిడ్‌ పోసి.. కత్తితో దాడి..

ABN, First Publish Date - 2021-12-05T16:41:11+05:30

రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరిని పెళ్లాడిన యువకుడిపై ప్రియురాలు యాసిడ్‌ పోయడంతో పాటు కత్తితో హత్యాయత్నం చేసిన ఘటన కోయంబత్తూరులో తీవ్ర సంచలనం సృష్టించింది. కేరళకు చెందిన రాకేష్‌, కాంచీపురానికి చెందిన జయంతి (27) రెండేళ్ల క్రితం దుబాయ్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఆర్నెల్ల క్రితం స్వస్థలాలకు తిరిగి వచ్చారు. ఇటీవల జయంతికి తెలియకుండా రాకేష్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఫోన్‌ చేసి గొడవపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కోయంబత్తూరు పీలమేడు ప్రాంతంలో ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మాటామాటా పెరగడంతో జయంతి వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రాకే‌ష్‌పై పోసి, కత్తితో దాడి చేసింది. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇద్దరూ అచేతనంగా పడిఉండగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-12-05T16:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising