ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో అధికభాగం రోగులకే: కేంద్రం
ABN, First Publish Date - 2021-04-22T07:38:04+05:30
దేశంలో నిత్యం ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్లో సింహభాగం వైద్య అవసరాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు కేటాయించామని కేంద్రం తెలిపింది...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశంలో నిత్యం ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్లో సింహభాగం వైద్య అవసరాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు కేటాయించామని కేంద్రం తెలిపింది. కొవిడ్ రోగులకు ప్రాణవాయువు కొరత ఏర్పడిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో... నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం ఈ విష యం స్పష్టం చేశారు. ప్రస్తుతం మన దేశంలో నిత్యం 7,500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుండగా, అందులో 6,600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను వైద్య అవసరాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు కేటాయించామన్నారు. వచ్చే కొన్ని రోజుల్లో ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు కృషి చేస్తామని పాల్ చెప్పారు.
Updated Date - 2021-04-22T07:38:04+05:30 IST