ఆలయాలను పరిరక్షిద్దాం
ABN, First Publish Date - 2021-01-18T07:12:37+05:30
మతాలు వేరైనా దేవు డు ఒక్కడే అని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనలో భాగంగా అహోబిలం పీఠాధిపతి
చినజీయర్, రామానుజ జీయర్ పిలుపు
మంత్రాలయంలో పర్యటన.. లక్ష విరాళం
మంత్రాలయం, జనవరి 17: మతాలు వేరైనా దేవు డు ఒక్కడే అని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనలో భాగంగా అహోబిలం పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామితో కలిసి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రాలయం మండలం వగరూరులో ధ్వంసమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయా న్ని సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం చిన జీయర్ స్వామి రూ.లక్ష విరాళం అందించారు. చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. అన్ని మతాల సారం ఒక్కటేనని, దేవుడిని వివిధ రూపాల్లో ఆరాధించినా.. ఆయన ఒక్కడేనని అన్నారు. ఆలయాల పరిరక్షణకు కలిసికట్టుగా పాటుపడాలని కోరారు. మతాలను, కులాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని చిన జీయర్, రామానుజ జీయర్లు సందర్శించారు.
Updated Date - 2021-01-18T07:12:37+05:30 IST