ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరద్ యాదవ్‌తో లాలూ భేటీ

ABN, First Publish Date - 2021-08-04T01:13:01+05:30

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్‌‌ను కలిశారు. ఇరువురు దాదాపు గంటకు పైగా మాట్లాడుకున్నారు. లాలూతోపాటు ఎంపీలు ప్రేమ్ చంద్ గుప్తా, మీసా భారతి ఉన్నారు. శరద్ యాదవ్ చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 


లాలూ విలేకర్లతో మాట్లాడుతూ, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, తాను సామ్యవాద నేతలమని, తమ వంటి సామ్యవాద నేతలు లేకపోవడం వల్ల పార్లమెంటులో ప్రజలకు సంబంధించిన సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌ను ప్రశంసించారు. పార్టీలో విభేదాలు వచ్చినప్పటికీ, నాయకుడిగా చిరాగ్ ఎదిగారని చెప్పారు. ఆయన వైపు ప్రజలు ఉన్నారని అన్నారు. 


ఎల్‌జేపీలో చిరాగ్‌తో సహా  ఆరుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఆయన మినహా మిగిలినవారంతా పశుపతి పరాస్‌తో కలిసి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. పశుపతి కూడా ఎల్‌జేపీ ఎంపీ. ఆయన చిరాగ్‌కు సమీప బంధువు. పశుపతికి ఇటీవల కేంద్ర మంత్రి పదవి లభించింది. 


Updated Date - 2021-08-04T01:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising