రామరాజ్యం కాదు, కిల్లింగ్ రాజ్యం: మమత ఫైర్
ABN, First Publish Date - 2021-10-05T00:00:17+05:30
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ..
కోల్కతా: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఇది కిల్లింగ్ రాజ్యం అని యూపీ సర్కార్ను తప్పుపట్టారు. ఈ ఘటన విచారకరం, దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనను ఖండించడానికి తనకు మాటలు కూడా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, నియంతృత్వాన్ని మాత్రమే వారు కోరుకుంటూ ఉంటారని అన్నారు. ''ఇదా రామరాజ్యం? కానేకాదు. ఇది...కిల్లింగ్ రాజ్యం''అని మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. లఖింపూర్ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా తొమ్మిది మంది మృతి చెందారు.
Updated Date - 2021-10-05T00:00:17+05:30 IST