కేరళలో తగ్గని కరోనా ఉధృతి.. కొత్తగా 12,443 కేసులు..
ABN, First Publish Date - 2021-06-20T04:54:39+05:30
కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా..
తిరువనంతపురం: కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 12,443 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 1,21,743 నమూనాలను పరీక్షించగా.. ఈ మేరకు కేసులు వెలుగుచూసినట్టు సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,06,861 వరకు ఉన్నట్టు ఆయన తెలిపారు. కాగా శనివారం మరో 115 మంది మృత్యువాత పడడంతో.. రాష్ట్రంలో కరోనా మరణాలు 11,948కి పెరిగాయి.
Updated Date - 2021-06-20T04:54:39+05:30 IST