సీజేఐ బదులిస్తారనుకోలేదు!
ABN, First Publish Date - 2021-06-10T08:54:26+05:30
తాను రాసిన లేఖకు ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రత్యుత్తరమిస్తారని ఊహించలేదని కేరళ బాలిక లిడ్వినా జోసెఫ్ తెలిపింది. ఉత్తరంతోపాటు సీజేఐ నుంచి
ఆనందంగా ఉంది.. కేరళ బాలిక లిడ్వినా
త్రిసూర్, జూన్ 9: తాను రాసిన లేఖకు ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రత్యుత్తరమిస్తారని ఊహించలేదని కేరళ బాలిక లిడ్వినా జోసెఫ్ తెలిపింది. ఉత్తరంతోపాటు సీజేఐ నుంచి భారత రాజ్యాంగ ప్రతిని అందుకున్న ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆమె త్రిసూర్లోని కేంద్రీ య విద్యాలయంలో ఐదో తరగతి చదువుతోంది. ‘‘సీజేఐ నుంచి సమాధానం వస్తుందని ఊహించలేదు. నాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంది’’ అని లిడ్వినా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
ఆక్సిజన్ అందుబాటులో లేక పెద్ద సంఖ్యలో కొవిడ్ మరణాలు సంభవించినట్లుగా రోజూ పేపర్లలో వార్తలు చదివిన ఆ చిన్నారి చలించిపోయింది. కొవిడ్ నియంత్రణ, ఆక్సిజన్ సరఫరా విషయంలో సుప్రీంకోర్టు పలు ఆదేశాలివ్వడంతో ఆమె సీజేఐ రమణకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాసింది. కోర్టులో ఒక కేసు విచారణ దృశ్యాన్ని ఆమె సృజనాత్మకంగా బొమ్మ గీసి పంపింది. దీనిపై సీజేఐ రమణ ఆమెకు బదులిచ్చారు. తన కుమార్తె రోజూ దినపత్రికలు చదువుతుందని, కొవిడ్ మరణాలు ఆమెకు మనోవేదన కలిగించాయని లిడ్వినా తండ్రి జోసెఫ్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆ ఆవేదనతోనే సీజేఐకి లేఖ రాసిందన్నారు.
Updated Date - 2021-06-10T08:54:26+05:30 IST