ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల లాగే కశ్మీరీలూ త్యాగాలు చేయాలేమో: ఫరూఖ్‌ అబ్దుల్లా

ABN, First Publish Date - 2021-12-06T07:08:09+05:30

కశ్మీర్‌ ప్రజలు ఆర్టికల్‌ 370, రాష్ట్ర హోదాను మళ్లీ పొందాలంటే రైతుల లాగే త్యాగాలు చేయాల్సి ఉంటుందేమోనని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్‌, డిసెంబరు 5: కశ్మీర్‌   ప్రజలు  ఆర్టికల్‌ 370, రాష్ట్ర హోదాను మళ్లీ పొందాలంటే రైతుల లాగే త్యాగాలు చేయాల్సి ఉంటుందేమోనని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా అన్నారు. తన తండ్రి, ఎన్సీ వ్యవస్థాపకుడు షేక్‌ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన పార్టీ యువ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఏడాది పాటు రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ చట్టాలను రద్దు చేయించారు. అలాగే ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు, రాష్ట్ర హోదాను మళ్లీ పొందేందుకు కశ్మీరీలు కూడా త్యాగాల్సి చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే హింసను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించం. 370 పునరుద్ధరణ, రాష్ట్ర హోదాను మళ్లీ తెస్తామని మేము హామీ ఇచ్చాం. అందు కోసం ఎలాంటి త్యాగానికైనా మేము సిద్ధమే’’ అని ఫరూఖ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-06T07:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising