Karnataka: మరోసారి కంపించిన భూమి
ABN, First Publish Date - 2021-10-21T17:28:05+05:30
విజయపుర జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కదలినట్లు కావడంతో ప్రజలు ఇళ్లు వీడి రోడ్లపైకి పరుగులు తీశారు. విజయపుర జిల్లా తికోట తాలూకా బాబానగర్తో పాటు పలు గ్రామా
బెంగళూరు(Karnataka): విజయపుర జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కదలినట్లు కావడంతో ప్రజలు ఇళ్లు వీడి రోడ్లపైకి పరుగులు తీశారు. విజయపుర జిల్లా తికోట తాలూకా బాబానగర్తో పాటు పలు గ్రామాలలో బుధవారం ఉదయం 10.30 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇటీవల నెల రోజులలో భూమి కంపనలు జరుగుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్హార్ తాలూకాలోని మసూతి గ్రామాన్ని నేషనల్ జియోఫిజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఇదే సమయంలోనే పలు గ్రామాలలో భూమి కంపించిన ఆనవాళ్లు లభించాయి.
Updated Date - 2021-10-21T17:28:05+05:30 IST