అంత్యక్రియల్లో పాల్గొన్న 25 మందికి ‘కరోనా’
ABN, First Publish Date - 2021-04-17T18:11:30+05:30
బంధువు మృతిచెందాడని చివరి చూపు చూద్దామని అంత్యక్రియలకు వెళ్లిన 25మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
బెంగళూరు: బంధువు మృతిచెందాడని చివరి చూపు చూద్దామని అంత్యక్రియలకు వెళ్లిన 25మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొడగు జిల్లా కుశాల్నగర్ గోపాల్ సర్కిల్కు చెందిన ఓ మహిళ బెంగళూరులో మృతి చెందారు. సొంత ప్రాంతంలో అంత్యక్రియలు చేసేందుకు కుశాల్నగర్కు తీసుకెళ్లారు. మడికేరి, విరాజ్పేట, సోమవారపేట, కుశాల్నగర్లకు చెందిన 25మంది బంధువులు అంత్యక్రియలలో పాల్గొన్నారు. వారందరూ అస్వస్థతకు లోను కావడంతో గురువారం పరీక్షలు జరిపించుకోగా అందరికీ కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మృతి చెందిన మహిళకు కొవిడ్ పాజిటివ్ లేకున్నా పాల్గొన్నవారి నుంచే ఒకరి నుంచి మరొకరికి సోకింది.
Updated Date - 2021-04-17T18:11:30+05:30 IST