ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'పొరుగు' ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు: బొమ్మై

ABN, First Publish Date - 2021-08-10T23:55:46+05:30

కోవిడ్ కేసులు పెరగకుండా కేరళ, మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చే ప్రయాణికుల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కోవిడ్ కేసులు పెరగకుండా కేరళ, మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కేరళ నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రైలు ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు జరపాలని భారత రైల్వేస్‌ను తాము కోరినట్టు చెప్పారు. రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న పలు జిల్లాల్లో కోవిడ్ కేసుల ప్రభావం కనిపిస్తోందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్రయాణికులకు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు జరపాలని రైల్వే అధికారులను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కోరారని చెప్పారు. మూడో వేవ్‌తో పోరాడేందుకు ముందస్తు చర్యలు తీసుకుటున్నామని, కేసులు మరిన్నిపెరిగితే, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మొదటి, రెండు వేవ్‌లలో కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి వల్లే కేసులు పెరిగాయని సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2021-08-10T23:55:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising