పవార్ను కలిసిన కర్ణాటక ముఖ్యమంత్రి
ABN, First Publish Date - 2021-08-06T23:40:28+05:30
ఎన్సీపీ నేత శరద్ పవార్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారంనాడిక్కడ..
బెంగళూరు: ఎన్సీపీ నేత శరద్ పవార్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారంనాడిక్కడ కలుసుకున్నారు. బొమ్మై నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర మధ్య జలాల పంపిణీకి సంబంధించిన అంశం చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు రెండు రాష్ట్రాల్లోనూ వరదల సమయంలో పరస్పరం సహకరించుకోవడంపై కూడా వీరు చర్చించారు. అంతర్ రాష్ట్ర జలాల అంశం, నీటి పంపకాలపై త్వరలో సమగ్ర చర్చలు జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
Updated Date - 2021-08-06T23:40:28+05:30 IST