ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanwar yatra.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ప్రకటన

ABN, First Publish Date - 2021-07-17T23:52:24+05:30

గంగాజలాన్ని ట్యాంకర్లలో తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. కరోనా కారణంగా కన్వర్ యాత్ర రద్దయిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిద్వార్: గంగాజలాన్ని ట్యాంకర్లలో తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. కరోనా కారణంగా కన్వర్ యాత్ర రద్దయిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘గంగాజలం కావాలని రాష్ట్రాలు కోరితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇందుకు  పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. హరిద్వార్ నుంచి ట్యాంకర్ల ద్వారా గంగాజలాన్ని తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తాం’’ అని అదనపు చీఫ్ సెక్రెటరీ ఆనంద్ వర్థన్ తాజాగా పేర్కొన్నారు. కన్వర్ యాత్రలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి శివభక్తులు హరిద్వార్‌కు చేరుకుంటారు. అక్కడ సేకరించిన గంగాజలంతో తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో ముక్కంటికి అభిషేకాలు చేస్తారు. జులై 25న ప్రారంభం కావాల్సిన ఈ యాత్రను ప్రభుత్వం కరోనా కారణంగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ట్యాంకర్ల ద్వారా గంగాజలాన్ని తరలించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతిచ్చింది.

Updated Date - 2021-07-17T23:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising