Uttar Pradesh:అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా రనౌత్
ABN, First Publish Date - 2021-10-02T12:38:02+05:30
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ను...
లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ను ప్రకటించింది.కంగనారనౌత్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను అధికారిక నివాసంలో కలిశారు.యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సినీనటి కంగనా ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడరుగా నియమితురాలు కావడం విశేషం.రాష్ట్రంలోని 75 జిల్లాల్లో ఉత్పత్తి-నిర్దిష్ట సంప్రదాయ పారిశ్రామిక హబ్లను సృష్టించే లక్ష్యంతో యూపీ ప్రభుత్వం ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘‘ప్రముఖ నటి కంగనా రనౌత్ సీఎం యోగిని కలిశారు.
కంగనాకు ఓడీఓపీ ప్రొడక్ట్ ను సీఎం అందించారు. కంగనా జీ ఓడీఓపీ కి మా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు.’’ అని యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహగల్ ట్వీట్ చేశారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న అభివృద్ధి పనులను నటి కంగనా రనౌత్ ప్రశంసించారు. కంగనా రనౌత్ లక్నో వచ్చిన సందర్భంగా అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు.
Updated Date - 2021-10-02T12:38:02+05:30 IST