ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kabul: డ్రోన్ దాడి పొరపాటు...యూఎస్ మిలటరీ కమాండర్ క్షమాపణలు

ABN, First Publish Date - 2021-09-18T15:37:18+05:30

అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలో తాము జరిపిన డ్రోన్ దాడి తమ తప్పిదమని అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ శనివారం క్షమాపణలు చెప్పారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ (అమెరికా): అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలో తాము జరిపిన డ్రోన్ దాడి తమ తప్పిదమని అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ శనివారం క్షమాపణలు చెప్పారు. కాబూల్ నగర విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని, గత నెలలో కాబూల్‌లో అమెరికన్ దళాలు జరిపిన డ్రోన్ దాడి పొరపాటని అమెరికా మిలటరీ అంగీకరించింది. ఈ డ్రోన్ దాడిలో ఏడుగురు చిన్నారులతో సహా 10 మంది పౌరులు మరణించారు.‘‘ డ్రోన్ దాడి చేయడం పొరపాటు, దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. పోరాట కమాండర్‌గా ఈ విషాద ఫలితానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను’’ అని పెంటగాన్ వార్తా సమావేశంలో ఫ్రాంక్ మెకెంజీ విలేకరులతో చెప్పారు.మరణించిన వారి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మెకెంజీ పేర్కొన్నారు.


Updated Date - 2021-09-18T15:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising