భారత్తో దృఢమైన బంధం
ABN, First Publish Date - 2021-10-29T15:39:46+05:30
భారత్-జర్మన్లది దృఢమైన బంధమని చెన్నైలోని ఆ దేశ రాయబారి కరిన్ స్టోల్ పేర్కొన్నారు. సునామీ అనంతరం తీవ్రంగా నష్టపోయిన నాటపట్టినం చుట్టుపక్కల ప్రాంతాల బాధిత ప్రజలను ఆదుకునేందుకు, వారికి వృత్తి నైపుణ్య శి
- జర్మన్ రాయబారి కరిన్ స్టోల్
చెన్నై(Chennai): భారత్-జర్మన్లది దృఢమైన బంధమని చెన్నైలోని ఆ దేశ రాయబారి కరిన్ స్టోల్ పేర్కొన్నారు. సునామీ అనంతరం తీవ్రంగా నష్టపోయిన నాటపట్టినం చుట్టుపక్కల ప్రాంతాల బాధిత ప్రజలను ఆదుకునేందుకు, వారికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకకేంద్రాన్ని కరిన్ స్టోల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆ కేంద్రం పనిచేస్తున్న తీరును, అక్కడ శిక్షణ పొంది జీవితాలను మెరుగుపరచుకున్న వారి విశేషాలను తెలుసుకున్నారు. అక్కడ శిక్షణ పొందుతున్నవారితోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శిక్షణా కేంద్రంలోని తరగతి గదులను పరిశీలించారు. శిక్షణలో భాగంగా విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను ఆమె ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి సాంకేతికత, ప్రతిభలను భారత్-జర్మనీ ఉమ్మడి దృష్టిలో పెట్టుకుని సమగ్రాభివృద్ధికి పంచుకున్నాయన్నారు. ఈ ఉమ్మడి దృష్టి బారత్తో వున్న బంధానికి బలమైన ప్రతిబింబమన్నారు. ఇప్పటివరకూ ఈ కేంద్రంలో వెయ్యిమంది శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నట్టు తెలిసి సంతోషంగా వుందన్నారు.
Updated Date - 2021-10-29T15:39:46+05:30 IST