హర్యానా అసెంబ్లీకి అభయ్ చౌతాలా రాజీనామా
ABN, First Publish Date - 2021-01-27T21:57:43+05:30
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) ఎమ్మెల్యే అభయ్ చౌతాలా బుధవారంనాడు పంజాబ్ అసెంబ్లీకి..
ఛండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) ఎమ్మెల్యే అభయ్ చౌతాలా బుధవారంనాడు పంజాబ్ అసెంబ్లీకి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన ఈ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా ఆమోదించారు. చౌతలా తన మద్దతు దారులతో కలిసి టాక్టర్పై విధాన సభకు చేరుకున్నారు. స్పీకర్ను కలుసుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు.
'ఎల్లానాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభయ్ సింగ్ చౌతాలా కొద్ది నిమిషాల క్రితం వ్యక్తిగతంగా నన్ను కలుసుకుని రాజీనామా సమర్పించారు. దానిని ఆమోదించాను. గతంలో కూడా ఆయన రైతుల డిమాండ్లను కేంద్రం నిరాకరిస్తోందంటూ నాకు రెండు సార్లు లేఖలు రాశారు' అని స్పీకర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాజీనామా అనంతరం మీడియాతో అభయ్ చౌతాలా మాట్లాడుతూ, ఢిల్లీలో 'రిపబ్లిక్ డే' హింసకు బీజేపీనే కారణమని ఆరోపించారు.
Updated Date - 2021-01-27T21:57:43+05:30 IST