ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Poonch: పాక్ చొరబాటుదార్లపై భారత ఆర్మీ కాల్పులు..ఉగ్రవాది హతం

ABN, First Publish Date - 2021-08-30T18:03:51+05:30

దేశ సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైనికులు సోమవారం భగ్నం చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : దేశ సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైనికులు సోమవారం భగ్నం చేశారు.జమ్మూకశ్మీరులోని పూంచ్ సెక్టారులోని నియంత్రణ రేఖ వద్ద పాక్ మద్ధతు ఉన్న ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. భారత సైనిక దళాలు ఇంటిగ్రేటెడ్ నిఘా గ్రిడ్ ద్వారా సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని గుర్తించాయి. భారత సైనికులు చొరబాటుదారులను నిలిపివేయడంతో వారు కాల్పులకు దిగారు. దీంతో సైనికులు పాక్ చొరబాటుదారులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు. 


సైనికుల కాల్పుల్లో హతం అయిన ఉగ్రవాది మృతదేహం వద్ద ఏకే -47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.భారత సైనికుల కాల్పులతో పాక్ చొరబాటు భగ్నం అయింది. సరిహద్దుల్లో చొరబాటుదార్ల కోసం సైనికులు గాలిస్తున్నారు.పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాలతో నియంత్రణ రేఖ వద్ద ఉన్న సైనికులు అప్రమత్తమయ్యారు.


Updated Date - 2021-08-30T18:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising