ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్ల సమయపాలనకు రైల్వేశాఖ నూతన విధానం!

ABN, First Publish Date - 2021-09-16T15:06:09+05:30

రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం లింక్ ఎక్స్‌ప్రెస్, స్లీపర్ కోచ్‌ల సంఖ్యను స్థిరంగా ఉంచనున్నారు. తద్వారా ఏ రైలుకైనా అదనంగా కోచ్‌లను చేర్చడం లేదా కోచ్‌లను తగ్గించడం లాంటివి చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధానం వలన సమయం ఆదా అవుతుంది. ఫలితంగా రైళ్లు నిర్ణీత సమయాలకే రాకపోకలు సాగించగలుగుతాయి. 


ముందుగా ఉత్తర రైల్వేలోని ఎనిమిది రైళ్లకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం నూతన రైల్వే టైం టేబుల్‌ను కూడా రూపొందిస్తున్నారు. రైల్వేశాఖలో గత కొన్నేళ్లుగా అక్టోబరులో రైల్వే టైమ్‌టేబుల్ రూపొందించి, ప్రకటిస్తూ వస్తోంది. కరోనా కారణంగా గత ఏడాది రైల్వే టైమ్ టేబుల్ ప్రకటించలేదు. అయితే ఈ ఏడాది నూతన రైల్వే టైమ్‌టేబుల్ ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికితోడు త్వరలో రైళ్ల ఛార్జీలలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Updated Date - 2021-09-16T15:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising