ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకకు చేరిన 5లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్!

ABN, First Publish Date - 2021-02-26T06:56:15+05:30

కరోనా వైరస్ విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అనేక దేశాలకు కొవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అనేక దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ను బహుమతిగా ఇస్తోంది. ఈ క్రమంలోనే భారత్.. శ్రీలంకకు కూడా ఇప్పటికే ఐదు లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌‌ను గత నెలలో అందించింది. తాజాగా మరో 5లక్షల డోసులను భారత ప్రభుత్వం శ్రీలంకకు పంపింది. కాగా.. వ్యాక్సిన్ డోసులతో కూడిన పార్శిల్ గురువారం రోజు శ్రీలంకకు చేరింది. ఈ క్రమంలో శ్రీలంక ఆరోగ్యశాఖ మంత్రి స్పందించారు. భారత్ పంపిన 5లక్షల డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ శ్రీలంకకు చేరినట్టు ప్రకటించారు. స్టేట్ ఫార్మాసిటికల్స్ కార్పోరేషన్ ఆఫ్ శ్రీలంక, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను పొందినట్టు చెప్పారు. శుక్రవారం నుంచి ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. 5లక్షల డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్ చేరిన సందర్భంగా శ్రీలంకలోని ఇండియన్ హైకమిషన్ స్పందించింది. ‘మహమ్మారిపై విజయం సాధించడానికి శ్రీలంకకు చరుకుగా సహాయం చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. 


Updated Date - 2021-02-26T06:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising