భారత్లో కొత్తగా 7,495 corona కేసులు
ABN, First Publish Date - 2021-12-23T15:56:41+05:30
గడచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 7,495 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: గడచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 7,495 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 6,960 మంది డిశ్చార్జ్ అవగా... 434 మంది మృతి చెందారు. ప్రస్తుతం 78,291 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,42,08,926గా ఉంది. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 4,78,759 మంది మృత్యువాతపడ్డారు. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,39,69,76,774గా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 236కి చేరింది.
Updated Date - 2021-12-23T15:56:41+05:30 IST