ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ladakh: త్వరలో భారత్, చైనా మిలిటరీ అధికారుల సమావేశం

ABN, First Publish Date - 2021-07-23T02:49:08+05:30

తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్, చైనా మిలిటరీ అధికారులు మరోమారు సమావేశం కానున్నారు. ఇప్పటివరకూ 11 పర్యాయాలు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ మారు జులై 26న సమావేశమవుదామని చైనా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్, చైనా మిలిటరీ అధికారులు మరోమారు సమావేశం కానున్నారు. ఇప్పటివరకూ 11 పర్యాయాలు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ మారు జులై 26న సమావేశమవుదామని చైనా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే.. ఆ రోజు కార్గిల్ దివస్ కావడంతో సమావేశం కుదరదని భారత్ చెప్పినట్టు తెలుస్తోంది. మరో తేదీని సూచించాలని కూడా చైనాను భారత్ కోరిందని విశ్వసనీయ వర్గాల కథనం. ఈ నేపథ్యంలో ఇరు దేశాలూ చర్చల కోసం మరో తేదీని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అతి త్వరలోనే ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని దెప్సాంగ్ మైదానాలు, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తొలగించడంపై ఇరు దేశాల మిలిటరీ అధికారులు ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా.. ఇరు దేశాలు ఒకేసారి తమ దళాలను వెనక్కు పిలిపించుకుంటేనే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని భారత్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది. 

Updated Date - 2021-07-23T02:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising