Talibans భారత్ వైపు వస్తే వైమానిక దాడులకు సిద్ధమే...
ABN, First Publish Date - 2021-11-01T12:32:45+05:30
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాలిబన్లకు సంచలన హెచ్చరిక జారీ చేశారు....
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన హెచ్చరిక
లక్నో:ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాలిబన్లకు సంచలన హెచ్చరిక జారీ చేశారు. తాలిబాన్ల ఆగడాలతో పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ దేశాలు కలవరపడుతున్నాయని, అయితే తాలిబన్లు భారత్ వైపు వచ్చేందుకు సాహసిస్తే వైమానిక దాడికి తాము సిద్ధమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.లక్నో నగరంలో జరిగిన సామాజిక ప్రతినిధుల సమ్మేళనంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ రాష్ట్రంలోని తన రాజకీయ ప్రత్యర్థులపై కూడా దాడికి దిగారు.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు దేశం శక్తివంతంగా ఉంది, ఏ దేశమూ భారత్ వైపు దృష్టి సారించే సాహసం చేయలేకపోతోంది. నేడు పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్లు తాలిబాన్ల వల్ల కలవరపడుతున్నాయి. కానీ, తాలిబన్లు భారత్ వైపు వస్తే తాము వైమానిక దాడికి సిద్ధంగా ఉన్నాం’’ అని సీఎం యోగి హెచ్చరించారు. త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం యోగి విపక్షాలపై విమర్శల దాడి పెంచారు. యూపీ అభివృద్ధితో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లకు సంబంధం లేదని సీఎం అన్నారు.రామభక్తులను హత్య చేసిన వారికి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పే ధైర్యం ఉందా అని ఎస్పీ పేరు చెప్పకుండా ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.
Updated Date - 2021-11-01T12:32:45+05:30 IST