ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయల్ బెంగాల్ టైగర్‌ను : మమత ప్రకటన

ABN, First Publish Date - 2021-04-11T20:02:33+05:30

ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో తాము ఓడిపోతామని బీజేపీకి బాగా తెలుసని, అందుకే తుపాకులను ఉపయోగిస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో తాము ఓడిపోతామని బీజేపీకి బాగా తెలుసని, అందుకే తుపాకులను ఉపయోగిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బుల్లెట్ల ప్రతీకారాన్ని బ్యాలెట్‌తో కచ్చితంగా తీర్చుకుంటామని దీదీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జలపాయ్‌గురి ప్రాంతంలో పర్యటించారు. కాల్పులు జరిగిన కోచ్‌బిహార్ జరిగిన ప్రాంతానికి తాను వెళ్లకుండా బీజేపీ అడ్డుకట్ట వేస్తోందని ఆరోపించారు. ‘‘నేను రాయల్ బెంగాల్ టైగర్‌ను. కోచ్‌బిహార్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అయినా నేను బాధిత కుటుంబాలతో వీడియో కాన్ఫరెన్స్‌తో మాట్లాడాను ’’ అని దీదీ పేర్కొన్నారు. మరోవైపు కోచ్‌బిహార్‌లో జరిగిన కాల్పుల్ని ఆమె మారణహోమంగా అభివర్ణించారు. సీఐఎస్‌ఎఫ్ బలగాలకు ప్రజల్ని అదుపు చేసే పద్ధతిని నేర్పించరని, ఫైర్ స్ర్పే లాగ కాల్పులు జరిపారని దుయ్యబట్టారు. కొందరికి ఛాతి, మెడ భాగాల్లో బుల్లెట్లు దిగాయని మండిపడ్డారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా 72 గంటల పాటు నిషేధం విధించారని మమత మండిపడ్డారు. 

Updated Date - 2021-04-11T20:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising