ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం ‘శివుడైతే’.. రాష్ట్రాన్ని కరోనా ఏం చేయగలదు..? బీజేపీ నేత వ్యాఖ్య

ABN, First Publish Date - 2021-08-09T21:41:07+05:30

ముఖ్యమంత్రి ‘శివుడైనప్పుడు’.. బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ ‘విష్ణువు’ అయినప్పుడు కరోనా మధ్యప్రదేశ్‌‌ను ఏం చేయగలదంటూ బీజేపీ జాతీయ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ తాజాగా వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: ముఖ్యమంత్రి ‘శివుడైనప్పుడు’.. బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ ‘విష్ణువు’ అయినప్పుడు కరోనా మధ్యప్రదేశ్‌‌ను ఏం చేయగలదంటూ బీజేపీ జాతీయ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ తాజాగా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ అన్న విషయం తెలిసిందే. ఇక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విష్ణుదత్ శర్మ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్ చుగ్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై కాంగ్రెస్ అధికారప్రతినిధి భూపేంద్ర గుప్తా బీజేపీకి చురకలు అంటించారు. ‘‘కరోనా విలయతాండవం చేస్తున్నప్పుడు వీరిద్దరూ నిద్రపోయారా..?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-08-09T21:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising