ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఏ ఆలయాల్లో విగ్రహాలు అదృశ్యమయ్యాయి?

ABN, First Publish Date - 2021-01-22T12:38:20+05:30

రాష్ట్రంలోని ఏఏ ఆలయాల్లో విగ్రహాలు అదృశ్యమయ్యాయనే వివరాలతో నివేదిక దాఖలుచేయాలని దేవాదాయ శాఖకు మద్రాసు హైకోర్టు నోటీసు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవాదాయ శాఖను ప్రశ్నించిన హైకోర్టు

చెన్నై/ఐసిఎఫ్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఏఏ ఆలయాల్లో విగ్రహాలు అదృశ్యమయ్యాయనే వివరాలతో  నివేదిక దాఖలుచేయాలని దేవాదాయ శాఖకు మద్రాసు హైకోర్టు నోటీసు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో వెంకట్రామన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో, హిందూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల చరిత్ర, విగ్రహాల ప్రాచీనత, స్థిర చరాస్తుల వివరాలతో కూడిన డాక్యుమెంట్లు పరిరక్షించాలని, అయితే పలు ఆలయాల్లో డాక్యుమెంట్లు కనిపించడం లేదని, వాటిని సంబంధించిన వివరాలను దేవదాయ శాఖ అధికారులు సేకరించి న్యాయస్థానానికి తెలిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి జస్టిస్‌ సెంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారించింది. దేవాదాయ శాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది వెంకటేష్‌, బదులు పిటిషన్‌ దాఖలుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిని అంగీకరించిన ధర్మాసనం, ఏఏ ఆలయాల్లో విగ్రహాలు కనిపించలేదో వాటి వివరాలతో నివేదిక దాఖలుచేయాలని దేవాదాయ శాఖకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

Updated Date - 2021-01-22T12:38:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising