స్వాతంత్ర్య దినోత్సవాల్లో బీజేపీ నేతలను అడ్డుకుంటాం : రైతు సంఘాలు
ABN, First Publish Date - 2021-07-25T21:46:55+05:30
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న
న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు తాజాగా బీజేపీకి మరో హెచ్చరికను జారీ చేశాయి. స్వాతంత్ర్య దినోత్సవాలనాడు జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా బీజేపీ నేతలను, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించాయి. హర్యానా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపాయి. ఓ రైతు సంఘం నేత జాతీయ మీడియాతో ఆదివారం మాట్లాడుతూ ఈ వివరాలను తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవాలనాడు బీజేపీ నేతలను అడ్డుకుంటామని ఓ రైతు సంఘం నేత ఓ జాతీయ న్యూస్ ఛానల్కు తెలిపారు. హర్యానాలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామన్నారు. బీజేపీ నేతలకు నల్ల జెండాలు చూపుతామని తెలిపారు.
ఈ ఏడాది జనవరి 26న న్యూఢిల్లీలో రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. రైతులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలలో పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. కొందరు వ్యక్తులు ఎర్రకోటపైకి వెళ్ళి, ఓ మతపరమైన జెండాను పెట్టారు.
Updated Date - 2021-07-25T21:46:55+05:30 IST