ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat: నాలుగు వారాల్లో 33 శాతం పెరిగిన కొవిడ్ కేసులు

ABN, First Publish Date - 2021-10-05T13:18:56+05:30

గుజరాత్ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. గుజరాత్ రాష్ట్రంలో కేవలం నాలుగువారాల్లోనే కొవిడ్ కేసుల సంఖ్య 33 శాతం పెరిగింది. సెప్టెంబరు మొదటి వారంలో రోజుకు సగటున 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4వతేదీ వరకు 120 కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రోజుకు 20 కరోనా కేసులు నమోదు కావడంతో కొవిడ్ కేసుల్లో 33 శాతం పెంపు కనిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్ నగరాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అహ్మదాబాద్ నగరంలో అనూహ్యంగా కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది.


 అహ్మదాబాద్ నగరంలో 30 శాతం కరోనా కేసులు పెరిగాయి. పండుగల సీజన్ సందర్భంగా ప్రజలు మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా షాపింగ్ చేయడం వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని అహ్మదాబాద్ హాస్పిటళ్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ భరత్ గధ్వీ చెప్పారు. గత 24 గంటల్లో గుజరాత్ లో 14 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. అహ్మదాబాద్ నగరంలో 6, సూరత్ నగరంలో 4, భావనగర్, వడోదర, వల్సాద్ నగరాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదైనాయి. గుజరాత్ రాష్ట్రంలో 6.2 కోట్ల మంది కొవిడ్ టీకాలు వేయించుకున్నారు.


Updated Date - 2021-10-05T13:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising